
దినేష్ కుమార్, అన్షు, రాజశేఖర్, జయంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శివం శైవం’. ఈ చిత్రానికి సాయి శ్రీనివాస్ ఎంకే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను దర్శకుడు వీరశంకర్ విడుదల చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులు ఫ్రెష్ ఫీల్ని ఇచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాత సాయి శ్రీనివాస్ చెప్పారు.
‘గ్రామీణ నేపథ్యంతో మైతాలజీ జోనర్లో ఓ డిఫరెంట్ కథ చెప్పాం.మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం.సాంగ్స్ , నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని సాయి శ్రీనీవాస్ అన్నారు.