జోడీ కుదిరింది | Salman Khan is set to share the screen with Nayanthara | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరింది

Mar 30 2026 4:19 AM | Updated on Mar 30 2026 4:19 AM

Salman Khan is set to share the screen with Nayanthara

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్నారనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ సరసన నయనతార నటించడం దాదాపు ఖరారైయిందని, కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సమాచారం.

ఈ జోడీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్‌ చివర్లో ప్రారంభించడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా రిలీజ్‌  చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం సల్మాన్‌ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement