ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా | Sabdham Movie OTT Telugu Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: ఏడాది తర్వాత ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Apr 10 2026 10:59 PM | Updated on Apr 10 2026 10:59 PM

Sabdham Movie OTT Telugu Streaming Now

ప్రస్తుతం అంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ కావడం ఆలస్యం.. నెల, నెలన్నరలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చాన్నాళ్ల తర్వాత అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి దీని సంగతి? ఎందులో ఉంది?

స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. 'శబ్దం' అనే హారర్ థ్రిల్లర్ చేశాడు. గతేడాది ఫిబ్రవరి 28న తెలుగు, తమిళంలో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. గతంలో ఆదితోనే 'వైశాలి' తీసిన అరివళగన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ సక్సెస్‌ని రిపీట్ చేయలేకపోయారు. ఇకపోతే ఈ మూవీ తమిళ వెర్షన్.. గత నెల 24న జీ5 ఓటీటీలోకి వచ్చింది. తర్వాత కొన్నిరోజులకు హిందీ వెర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

'శబ్దం' విషయానికొస్తే.. మున్నార్‌లోని ఓ మెడికల్ కాలేజీ. అందులోని విద్యార్థులు ఒకరు తర్వాత ఒకరు అనుమానస్పద రీతిలో చనిపోతుంటారు. పోలీసులు, మీడియాకు తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం.. ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్‌తో కాలేజీ మొత్తం పరిశోధిన జరిపించి దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం(ఆది పినిశెట్టి)ని తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలని తన దగ్గరున్న సాంకేతిక పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు.

అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక(లక్ష‍్మి మేనన్)పై వ్యూమాకి అనుమానం మొదలవుతుంది.ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతిక‌పై ఓ ప్రయోగానికి సిద్ధప‌డ‌గా, అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు క‌నిపెడ‌తాడు. ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవ‌రు? వాళ్లకు కాలేజీలో జ‌రుగుతున్న చావుల‌కు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement