మెగా హీరో రామ్ చరణ్ సతీమణికి అవార్డ్ వరించింది. మోస్ట్ పవర్పుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డ్ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఉపాసన. అయితే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల అవార్డ్ తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
Receiving the Most Powerful Women in Business Award by @business_today is truly humbling 🧿 @NSEIndia
Sorry, I couldn’t make it in person, unable to travel due to my pregnancy. 🤰🏼 🥰
At @_ur_life_ , our focus has always been on creating positive change mentally & physically.… pic.twitter.com/ZrInWT93QG— Upasana Konidela (@upasanakonidela) December 15, 2025


