‘నేను c/o నువ్వు’లాంటి చిత్రాలు ఇంకా రావాలి | Nenu Co Nuvvu Movie To Release On 30th September | Sakshi
Sakshi News home page

‘నేను c/o నువ్వు’లాంటి చిత్రాలు ఇంకా రావాలి

Sep 29 2022 6:22 PM | Updated on Sep 29 2022 6:22 PM

Nenu Co Nuvvu Movie To Release On 30th September - Sakshi

రత్న కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నేను c/o నువ్వు'. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న  గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ  ప్రముఖులకు, పాత్రికేయులకుప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాతలు , రాజకీయ నాయకులు  మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగుంది. మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం  మనం చూస్తునే ఉన్నాం. కాబట్టి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి.ఈ సినిమాల వలన  ప్రేక్షకులలో ఇంకా అవగాహన  పెరుగుతుంది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement