‘సర్కారు వారి పాట’ కోసం దుబాయ్ ఛలో

‘సర్కారు వారి పాట’ చిత్రీకరణను షురూ చేయడానికి మహేశ్ బాబు సిద్ధమయ్యారు. దుబాయ్ ప్రయాణం అయ్యారు కూడా. వచ్చే వారం నుంచి దుబాయ్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ 26న దుబాయ్లో ప్రారంభం కానుంది. కుటుంబంతో కలసి దుబాయ్ ప్రయాణం అయ్యారు మహేశ్బాబు. కోవిడ్ తర్వాత తొలిసారి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మహేశ్. ఇవాళ నమ్రత పుట్టిన రోజు. దుబాయ్లో బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు.
చదవండి:
నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు: మహేష్
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి