ఓ సామాజిక అంశం కోసం కోర్టులో లాయర్గా వాదనలు వినిపించనున్నారట కీర్తీ సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘సత్యవాన్ సావిత్రి’. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో మరో లీడ్ రోల్ చేశారు. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మిస్కిన్ లాయర్స్గా నటించారని తెలిసింది. మరోవైపు తెలుగులో వెంకటేశ్–కల్యాణ్రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాలోను, విజయ్ దేవరకొండ ‘రౌడీ జానర్ధన’లోనూ కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు.


