యూవీ క్రియేషన్స్‌తో కార్తికేయ సినిమా.. పోస్టర్‌ రిలీజ్‌  

Kartikeya Announced His Next Project With UV Creations - Sakshi

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్‌ లోహితస్వ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి రాజశేఖర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top