రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు | Bomb Threat To Houses Of Rajinikanth, Dhanush | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు

Oct 28 2025 3:31 PM | Updated on Oct 28 2025 4:02 PM

Bomb Threat To Houses Of Rajinikanth, Dhanush

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు(Bomb Threat ) కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా కోలీవుడ్స్టార్హీరోలు రజనీకాంత్(Rajinikanth)‌, ధనుష్ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి సోమవారం(అక్టోబర్‌ 27) సాయంత్రం ఓ ఈ మెయిల్ వచ్చింది. పోయస్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు.. కీల్పాక్కంలో ఉన్న టీఎన్ సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చివేస్తామని ఆ ఈమెయిల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ని రంగంలోకి దించి బెదిరింపులు వచ్చినవారి ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్ పంపినవారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. నెల 3 సీఎం స్టాలిన్తో పాటు హీరోయిన్త్రిష, బీజేపీ కార్యాలయం, డీజీపీ ఆఫీసుకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్టోబర్‌ 13 కూడా సీఎం స్టాలిన్‌, హీరో రజనీకాంత్ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement