ప్రేక్షకుల వెంట పరిగెత్తిన స్టార్‌ హీరో.. ఎవరూ గుర్తుపట్టలేదు! | Akshay Kumar surprise; he went undercover to get honest audience review | Sakshi
Sakshi News home page

రివ్యూ కోసం థియేటర్ వద్ద స్టార్‌ హీరో పరుగులు... వీడియో చూశారా?

Jun 8 2025 5:57 PM | Updated on Jun 8 2025 6:14 PM

Akshay Kumar surprise; he went undercover to get honest audience review

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ ఇటీవలే హౌస్‌ఫుల్‌-5 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హౌస్‌ఫుల్‌ సూపర్ హిట్‌ సిరీస్‌లో వచ్చిన ఐదో చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన అక్షయ్‌ కుమార్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి థియేటర్‌ వద్దకు వెళ్లాడు.

ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ రోజు నేను కిల్లర్ మాస్క్ ధరించి బాంద్రాలో హౌస్‌ఫుల్ 5 థియేటర్ నుంచి బయటికి వస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశా. ఈ అనుభవం చాలా హ్యాపీగా అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే అక్షయ్‌ కుమార్‌ను ఏ ఒక్క అభిమాని కూడా గుర్తు పట్టకపోవడం విశేషం. ఇది చూసిన నెటిజన్స్‌ ఇలా చేయడం అక్షయ్‌కి మాత్రమే సాధ్యమని అంటున్నారు.

కాగా.. జూన్ 6న విడుదలైన హౌస్‌ఫుల్‌-5 మూవీ దేశీయ బాక్సాఫీస్ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసింది.  తొలిరోజు రూ. 24 కోట్లు రాబట్టిన ఈ మూవీ..రెండో రోజున దాదాపు రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటించారు.
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement