
మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటం దక్కించుకున్న భారతీయ సంతతికి చెందిన యువతి

మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ అనేది పర్యావరణ అవగాహనను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించే అంతర్జాతీయ అందాల పోటీ.

ఇది కేవలం తన విజయం మాత్రమేకాదు ప్రతీ అమ్మాయి విజయం అని విధు పేర్కొంది.

మిసెస్ ఇండియా యూనివర్స్ ఇన్స్టాగ్రామ్లో విధు ఇషికను అభినందించింది.

దేశం గర్వపడేలా చేసిందంటూ ఆమెకు అభినందనల వెల్లువ కురిసింది.

విధు ఇషిక ప్రముఖ సింగర్ కూడా. ఒక ఫ్యాషన్ ప్లాట్ఫామ్ను కూడా స్థాపించింది.

2024లో మిసెస్ ఎర్త్ 2024 అవార్డు కూడా గెల్చుకున్న విధు ఇషిక తాజా టైటిల్తో ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది.




