నిధి అగర్వాల్ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే నటిగా దశాబ్దానికి చేరువు అవుతున్నా..ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారని చెప్పక తప్పదు . అదే సమయంలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే సంపాందిస్తున్నా, ఐరన్లెగ్ అనే ముద్ర నుంచి ఇంకా బయట పడలేదు. ఇక ప్రేమ వ్యవహారంలోనూ బాగానే వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అప్పుడామె ఆయనకు జంటగా ఈశ్వర్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సక్సెస్ కాకపోయినా, ప్రేయాయణం వార్తలతో బాగానే పాపులర్ అయ్యారు.

తెలుగుతో పాటు కోలీవుడ్లో ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. జయంరవికి జంటగా భూమి చిత్రంలో నటించారు. కానీ, ఆ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడంతో నిధి అగర్వాల్ కెరీర్కు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. ఆ మధ్య తెలుగులో పవన్ కల్యాణ్కు జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది కూడా పూర్తిగా నీరుగార్చింది. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. అదీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నెల ఖర్చు గురించి ఒక భేటీలో నిధిఅగర్వాల్ పేర్కొన్నారు. అందులో ‘ నా నెల ఖర్చు ఎంతో తెలుసా ? అంటూ చెప్పడం ప్రారంభించారు. నా నెలవారి ఖర్చు రూ. 5 లక్షలు అని పేర్కొన్నారు. నా ట్రావెలింగ్, బస,డయిట్,జిమ్, ట్రైనర్, పార్లర్ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్స్టైలింగ్, ఫోటోస్ వంటి ఖర్చులను కొన్ని సార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించినా, కొన్ని సార్లు నేను భరించాల్సి ఉంటుంది’ అని నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు.


