బండ్ల ఊరేగింపులో భక్తులు
బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రుడి జాతర వైభవంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఉత్సవాల్లో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్ తెలిపారు. – టేక్మాల్(మెదక్)


