నష్టపోయిన రైతులను ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

Sep 2 2025 11:13 AM | Updated on Sep 2 2025 11:13 AM

నష్టపోయిన రైతులను  ఆదుకుంటాం

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

పాపన్నపేట(మెదక్‌): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాంధారిపల్లిలో నీట మునిగిన పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో సుమారు 40 శాతం పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయని చెప్పారు. అధికారుల సర్వే అనంతరం నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. అనంతరం కొంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా ఆహ్వానించారు. అంతకుముందు నాగ్సాన్‌పల్లిలో బాధిత కుటుంబాలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కిసాన్‌సెల్‌ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, హఫీజ్‌ మొల్‌సాబ్‌, ప్రవీణ్‌, ఖలీం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement