మంచిర్యాలఅర్బన్: నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం మార్క్స్భవన్లో పీడీఎస్యూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తోకపేర్లతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సికిందర్, కార్తీక్, సంజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.


