ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ఆదివాసీల ఆరా ధ్యదైవం ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు ఘ నంగా పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. బావై (వైశాఖ) మాసం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు ఆలయానికి తరలివచ్చి నైవేద్యం తయారు చేసి సమర్పించారు. ఆదివారం మండలంలోని మారుతిగూడ, హీరపూర్, దొడందా, వడగామ్, గట్టెపల్లి, తుమ్మగూడ గ్రామాలతో పాటు నార్నూర్ మండలాల ఆదివాసీలు తరలివచ్చి ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ మహరాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల భక్తులున్నారు.


