చెరువులో పడి
యువకుడు..
ఆదిలాబాద్రూరల్: చెరువులో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..మండలంలోని జందాపూర్ గ్రామానికి చెందిన సొప్పరి సాయికుమార్ (31) కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపై శనివారం వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులను చెరువు ఒడ్డున దించారు. ఎడ్లకు చెరువులో నీళ్లు తాగించే క్రమంలో లోతు నీళ్లలోకి తీసుకెళ్లాయి. ఎడ్లబండిపై ఉన్న సాయికుమార్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆయన అరుపులు విన్న సమీపంలోని ఉపాధి కూలీలు అతన్ని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో రిమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ..
ఆదిలాబాద్టౌన్: పట్టణంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని భుక్తాపూర్లోని హలి ్దరాం షాప్ ముందు గల డ్రెయినేజీలో ఇచ్చోడకు చెందిన జంగల్వార్ అనిత (45) మృతిచెంది ఉంది. శనివారం స్థానికులు గమనించి వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సునీల్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


