నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్మెంట్తో పనిచేసే పార్టీ కాంగ్రెస్. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్కార్డులు, ఉచిత విద్యుత్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం.
– బొమ్మ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్


