లక్సెటిపేట: ఈ నెల 28న నిర్వహించే జాతీ య లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సా యికిరణ్ అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం పోలీస్ అధికారులతో స మావేశం నిర్వహించారు. లోక్ అదాలత్లో పరిష్కరించే కేసుల్లో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు. ఇరువర్గాల కక్షిదారుల సమన్వయంతో రాజీ కుదిర్చే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపా రు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవింద్రావు, సీఐ రమణమూర్తి, ఎస్సైలు పాల్గొన్నారు.


