వేబ్రిడ్జిపై కూరుకుపోయిన టిప్పర్
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా సీహెచ్పీపై టిప్పర్ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం బొగ్గు లోడ్తో వచ్చిన టిప్పర్ తూకం సమయంలో వేబ్రిడ్జి గార్డర్ విరిగిపోగా పక్కనున్న కంప్యూటర్ గదిపై ఒరిగింది. దీంతో కొన్ని బొగ్గు పెళ్లలు కిటికీల్లోంచి జారి గదిలో పడ్డాయి. ఏ మాత్రం లారీ మరింత ఒరిగినా గది కూలిపోయేదని, అందులోని క్లర్క్ ప్రాణాలు పోయేవని ప్రత్యక్ష సాక్షులు తె లిపారు. తృటిలో ప్రమాదం తప్పిందని పే ర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత లారీని అ క్కడి నుంచి తొలగించారు. నిర్వహణ లోపంతోనే గార్డర్ విరిగిందని కార్మికులు చెబుతున్నారు. సీహెచ్పీలో అధికారులు రక్షణ చర్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరో పించారు.


