
కార్మికులు, యాజమాన్యానికి వారధిగా యూనియన్
కాసిపేట: కార్మికులు, ప్రజలు, యాజమాన్యానికి వారధిగా యూనియన్ పని చేస్తుందని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్రావు తెలిపారు. కంపెనీ తరఫున సమీప గ్రామాల ప్రజలకు సేవలందించేందుకు అంబులెన్స్ను గురువారం ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా బోనస్ రూ.4వేలు పెంచినట్లు తెలిపారు. ఒకేసారి 26క్వార్టర్లు అర్హులకు ఇప్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్రెడ్డి, మెరుగు శంకర్, నాయకులు జనార్థన్, అబ్ధుల్ సత్తర్, కొమ్ముల బాపు తదితరులు పాల్గొన్నారు.