పంచాయతీ ఎన్నికల విడతలు మారాయి.. | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల విడతలు మారాయి..

Oct 2 2025 8:01 AM | Updated on Oct 2 2025 8:01 AM

పంచాయతీ ఎన్నికల విడతలు మారాయి..

పంచాయతీ ఎన్నికల విడతలు మారాయి..

● మూడో విడత మండలాలు తొలిసారికి.. ● తొలి విడతవి రెండోసారికి.. ● రెండో విడతవి మూడోసారికి.. ● మొదటి విడతలో దండేపల్లి, హాజీపూర్‌, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ● రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ● మూడో విడతలో భీమారం, చెన్నూర్‌, జైపూర్‌, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఎన్నికలు ఉంటాయి.

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు విడతల్లో నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్టోబర్‌ 31న మొదటి విడత, నవంబర్‌ 4న రెండో విడత, నవంబర్‌ 8న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల కమిషన్‌ మూడు విడతల్లోని మండలాలను కొంత మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడతల్లోనే ఎన్నికలు జరుగనుండగా.. ఎన్నికలు జరిగే మండలాలు మారాయి. మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉన్న మండలాలు మొదటి విడతలోకి రాగా.. రెండో విడతలోని మండలాలు మూడో విడతలోకి, మొదటి విడతలో ఉన్న మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement