40 శాతం లాభాల వాటా చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

40 శాతం లాభాల వాటా చెల్లించాలి

Sep 19 2025 2:44 AM | Updated on Sep 19 2025 2:44 AM

40 శాతం లాభాల వాటా చెల్లించాలి

40 శాతం లాభాల వాటా చెల్లించాలి

శ్రీరాంపూర్‌: సింగరేణి గడిచిన ఆర్థిక సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్‌ చేశారు. గురువారం నస్పూర్‌ కాలనీలోని ఆ యూనియన్‌ కార్యాలయంలో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ లాభాల లెక్క తేల్చలేదన్నారు. కార్మికులు కష్టపడి పని చేస్తేనే లాభాలు వచ్చాయని, వాటా పంచడానికి జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆ యూనియన్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, నాయకులు రాగం రాజేందర్‌, మంద కమలాకర్‌, మేకల స్వామి తిరుపతి, మోతే ఓదెలు, రాజు, చెల్లా శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement