డెంగీపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

డెంగీపై అవగాహన కల్పించాలి

May 16 2025 1:42 AM | Updated on May 16 2025 1:42 AM

డెంగీపై అవగాహన కల్పించాలి

డెంగీపై అవగాహన కల్పించాలి

మంచిర్యాలటౌన్‌: డెంగీ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన క ల్పించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హ రీశ్‌రాజ్‌ అన్నారు. ఈ నెల 16న జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకుని గురువారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. జిల్లాలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో అవగాహన చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 42 మందికి పరీక్ష చేస్తే ఇద్దరికి డెంగీ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఇల్లు, పరిసరాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రతీ ఫ్రై డే డ్రై డే పాటించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్‌ అనిత, డాక్టర్‌ కృపాబాయి, డాక్టర్‌ సీతా రామరాజు, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, ప్రశాంతి, కాంతారావు, దామోదర్‌, సంతోశ్‌, మాస్‌ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement