స్మార్ట్ఫోన్లో బందీ అవుతున్న బాల్యం
● ‘జడ్చర్లలో ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు 12 ఏళ్లలోపు చిన్నారులు, ఒక 16 ఏళ్ల బాలుడు కలిసి అత్యాచారం చేశారు. చిన్నారి ఆరోగ్యంలో మార్పు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యురాలు లైంగికదాడిజరిగినట్లు గుర్తించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు బాలురపై పోక్సో కేసు నమోదు చేసి జువనైల్ హోంకు తరలించారు. ఇందులో ఆ చిన్నారి సొంత అన్న ఉండటం బాధాకరం.
మహబూబ్నగర్ క్రైం: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ అనేది ప్రతిఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటోంది. కొందరి వద్ద రెండు లేదా మూడు ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి అప్పుడప్పుడు ఫోన్ ఇవ్వడం, పాటలు, వీడియోలు చూపించడంతోపాటు గేమ్స్ ఆడించడం వల్ల వారికి ఇదే అలవాటుగా మారుతోంది. దీనికితోడు ప్రస్తుతం బోధనా పద్ధతులు మారిన నేపథ్యంలో ఏదైనా అంశాన్ని ఇచ్చి దానిపై పరిశోధన చేయమని పిల్లలకు టీచర్స్ చెబుతున్నారు. దీంతో విషయ పరిజ్ఞానం కోసం సులువైన మార్గంగా పిల్లలు ఆన్లైన్ను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ఇంట్లో పెద్దల ఫోన్లను వినియోగించేవారు కొందరైతే, పరిశోధన కోసం ప్రత్యేకించి ట్యాబ్లు కొనుగోలు చేయించుకుంటున్న వారు మరింకొందరు దీంతో పొద్దస్తమానం ఇంటర్నెట్ వినియోగిస్తూ పక్కదారి పడుతున్నారు. చివరికి ఓ వ్యసనంలా మారి స్మార్ట్ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
వేపతో ఔషధం
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో వేప విత్తన క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
–8లో u
తల్లిదండ్రులే కారణం..
ఆటలాడాల్సిన వయసులో ఇంటర్నెట్లో విహారం
సోషల్ మీడియా
షార్ట్ వీడియోలతో తీవ్ర దుష్ప్రభావాలు
చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు కారణంగా మారుతున్న వైనం
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అంటున్న నిపుణులు


