సమయం: గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు..
పాలమూరు: వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ప్రబలుతాయి. దీంతో డెంగీ, మలేరియా, చికెన్గున్యా వంటి ఇతర దోమకాటు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. సీజనల్ వ్యాధుల నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్తో గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అదేవిధంగా పీహెచ్సీలలో వైద్యుల సమయపాలన, మందుల సరఫరా ఇతర అంశాలపై సందేహాలు ఉంటే డీఎంహెచ్ఓ తో నివృత్తి చేసుకోవచ్చు.
నేడు సీజనల్ వ్యాధులపై ‘సాక్షి’ ఫోన్ ఇన్


