శ్రీరంగాపూర్ ఆలయం 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. సుమారు 350 ఏళ్ల క్రితం సూగూరు రాజవంశీయులు శ్రీరంగాపూర్ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోని నేళమాలిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారు పూతతో పూచీన అపురూప దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. ఆలయం సమీపంలోగల రంగసముద్రం చెరువు మధ్యలో కృష్ణ విలాస్ అనే రాజుల విడిది భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మహబూబ్నగర్ నుంచి 85 కిలోమీటర్లు పెబ్బేర్ ఉంటుంది. అక్కడి నుంచి శ్రీరంగాపూర్క్షేత్రం 12 కిలోమీటర్లు ఉంటుంది.


