పీయూలో ఇంజినీరింగ్‌ ల్యాబ్స్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పీయూలో ఇంజినీరింగ్‌ ల్యాబ్స్‌ ప్రారంభం

May 12 2026 1:14 AM | Updated on May 12 2026 1:14 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో ఇంజినీరింగ్‌ కళాశాల బీఈఈ ల్యాబ్‌, ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్‌, ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌ ల్యాబ్‌ను పీయూ వీసీ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ల్యాబ్స్‌ వినియోగించడంతో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, సబ్జెక్టుతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌, కంట్రోలర్‌ ప్రవీణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement