పాలమూరులో నిర్వహిస్తున్న హ్యాండ్బాల్ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటూ సత్తాచాటుతున్నారు.
–8లో u
డివిజన్లలో ఇదీ పరిస్థితి..
డివిజన్ నం.1లోని దొడ్డలోనిపల్లిలో పవర్ బోర్ల ద్వారా సరఫరా అయ్యే తాగునీటికి కొన్ని ఇళ్లకు పైపులైన్లు వేసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా కాని రోజుల్లో ఈ నీటినే వినియోగిస్తున్నారు.
డివిజన్ నం. 2లోని ఏనుగొండ బీసీకాలనీ, ఎస్సీ కాలనీలకు రెండు, మూడు రోజులకోసారి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వస్తోంది.
డివిజన్ నం.5 పరిధిలోని ఎదిరకు మూడు రోజుల నుంచి తాగునీరు రావడం లేదని స్థానికులు తెలిపారు.
డివిజన్ నం.11లోని గొల్లబండతండాలో ఎత్తు ప్రదేశంలోని సుమారు 150 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సన్నగా వస్తోంది.
డివిజన్ నం.16లోని బోయపల్లి– కోట్ల వీధి, యాదవకాలనీలు ఎత్తు ప్రదేశంలో ఉండటంతో మిషన్ భగీరథ తాగునీరు సరిగా అందడం లేదు.
డివిజన్ నం.41లోని సద్దలగుండు, రాజేంద్రనగర్లో, డివిజన్ నం.42లోని ప్రేమ్నగర్కు మూడురోజులకోసారి తాగునీరు అందుతోంది. శెట్టి కాంప్లెక్స్కు వెళ్లే దారిలో ఒకచోట్ల పైపులైన్కు లీకేజీ ఏర్పడటంతో తాగునీరు వృథాగా పారుతోంది.
డివిజన్ నం.47, 48, 49, 50లకు నాలుగు రోజులకోసారి తాగునీరు అందుతోంది. దీంతో కొందరు ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి వాడుకుంటున్నారు.


