భూగర్భ జలాలను కాపాడుకోవాలి
భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అవసరానికి మించి నీటిని విచ్చలవిడిగా వినియోగించరాదు. వర్షపాతం నమోదైనా రీచార్జి ఆశించినంతగా జరగడం లేదు. బోర్ల వినియోగం పెరగడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ప్రతి గ్రామంలో రీచార్జి పిట్లు, చెక్డ్యాంలు ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టడం అత్యవసరం. రైతులు మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అనుసరించి నీటి వినియోగాన్ని తగ్గించాలి. భూగర్భ జలాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – రవిశంకర్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి


