బాదేపల్లి శివారు ఎర్రగుట్ట ప్రాంతంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వచ్చి.. ఆరుగురికి ఇళ్ల పట్టాలను సైతం అందజేశారు. తర్వాత అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అర్హులను ఎంపిక చేసేందుకు పట్టణంలో పర్యటించి క్షేత్రస్థాయిలో కసరత్తు చేశారు. కానీ, అర్హుల జాబితాను రూపొందించేలోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇళ్ల కేటాయింపు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఎవరికి వారు ఆయా ఇళ్లలో చేరి ఆక్రమణలకు పాల్పడ్డారు.


