
శ్రీశైలంలో పది గేట్లు ఎత్తివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న నీటి ప్రవాహం పెరగడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద పది గేట్లను పైకెత్తి స్పిల్వే ద్వారా సాగర్కు నీటిని వదులుతున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 1,65,984, విద్యుదుత్పత్తి చేస్తూ 31,456, సుంకేసుల నుంచి 62,580 మొత్తం 2,60,020 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తున్నాయి. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద పదిగేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 2,69,730 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ.జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,237, మొత్తం 65,552 క్యూసెక్కుల నీళ్లను అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.6 అడుగుల నీటిమట్టం వద్ద 202.5056 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 27,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,824 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.854 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.281 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.