
ప్రశాంతంగా గ్రామ పాలనాధికారి పరీక్ష
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గ్రామ పాలన అధికారి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని చైతన్య హైస్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా.. మొత్తం 152 మంది అభ్యర్థులకు గాను 140 మంది హాజరవగా.. 12 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగా 1.30 గంటల వరకు కొనసాగింది. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. అలాగే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా పకడ్బందీగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఈఓ ప్రవీణ్, ఆర్డీఓ నవీన్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అహ్మద్, అర్బన్ డీటీ దేవేందర్ తదితరులున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
152 మందికి 140 మంది హాజరు
కేంద్రాన్ని పరిశీలించిన
కలెక్టర్ విజయేందిర