అమ్మమ్మ చెప్పిన కథ | - | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ చెప్పిన కథ

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

గాడిద–గుర్రం

రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిదమీద పెట్టుకొని తాను గుర్రం ఎక్కి పొరుగూరు వెళ్తున్నాడు. కొంత సేపటికి బరువులు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం అది నాబాధ్యత కాదు బరువులు మోయడానికి నువ్వు..సుఖంగా జీవించడానికి నేను అన్నది. బరువు మోయలేని గాడిద నడుము విరిగి కిందపడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తాను ఎక్కి ప్రయాణం సాగించాడు.ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈగాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది.–ఆత్మకూరు

నీతి : బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.

–కె.వేదశ్రీ,6వ తరగతి, మార్గదర్శి స్కూల్‌, ఆత్మకూరు

Advertisement
 
Advertisement
Advertisement