సౌత్జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్స్లో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఎంపికై ందని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో జి.మోహన్దాస్, వి.శివరామ్, బి.వెంకటేశ్, కె. విశాల్ ఆదిత్య, కె.శ్రితిన్, జె.అనిరుధ్, కె.తులసినాఽథ్ ఉన్నారు. ఈ జట్టుకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ.నాగరాజు కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.


