
పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
రామన్నపేట: మట్టెవాడ పీఎస్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(అంబర్ ప్యాకెట్లు) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యాపారి కొలారియా ముకేశ్ ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ మేరకు రూ.8.82 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
13 నుంచి రోలర్
స్కేటింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: అండర్–5 నుంచి 18 బాలబాలికలకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కేటింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి సిద్ధార్థ, ఓం ప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు 13వ తేదీన ఉనికిచర్లలో ఎస్ఎస్హౌస్ వద్ద, 14న రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాల కోసం 6301591754 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు.
13,14వ తేదీల్లో
వాగ్దేవిలో క్రీడాపోటీలు
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 13,14 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయి (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల) క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ సునీల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పోటీల్లో 32 కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. క్రీడా పర్యవేక్షకులుగా వాగ్దేవి కళాశాలల కార్యదర్శి సి.హెచ్. దేవేందర్రెడ్డి, సి.హెచ్.వాణిదేవి, డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ రామాంజనేయులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.
బాంబు బ్లాస్టింగ్లో
మునేశ్కు గాయాలు
ఎస్ఎస్తాడ్వాయి: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో గురువారం జరిగిన బాంబు బ్లాస్టింగ్లో తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన సీఆర్ఎఫ్ 195 బెటాలియన్ చెందిన ఆదివాసీ యువకుడు అలెం మునేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని బార్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది సమీపంలో బాంబులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో బాంబు పేలి మునేశ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మునేశ్ త్వరగా కోలుకోవా లని భూపతిపూర్ గ్రామస్తులతోపాటు మండల ప్రజలు సోషల్ మీడియా ద్వారా దేవతలను వేడుకుంటున్నారు.