వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి

Sep 10 2025 9:58 AM | Updated on Sep 10 2025 9:58 AM

వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి

వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

దేవరుప్పుల: వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవానికి సమష్టిగా కృషి చేద్దామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధిలోని వానకొండయ్య గుట్టపై మౌలిక వసతుల కోసం ఇటీవల మంజూరైన రూ.కోటి వినియోగంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంజూరైన నిధులతో ఆలయ ప్రాంగణం పునరుద్ధరణ, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భక్తుల కోసం తాగునీరు, స్నానపు గదుల సదుపాయాలు, పార్కింగ్‌ స్థలాల వంటి వసతులను కల్పించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. ప్రణాళిక మేరకు సత్వరమే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామన్నారు. వచ్చే జాతర నాటికి వానకొండయ్య గుట్ట రూపురేఖలు మార్చాలని పిలుపునిచ్చారు. తొలుత గుట్టపై ఆలయంలో మూలవిరాట్‌కు ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకొని పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆడెపు ఆండాలు, ఎంపీడీఓ సురేష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్‌, వివిధ శాఖల అధికారులు అరుణ, దివ్య, మానస, సింధుప్రియ, ఆలయ పూజారి బీట్కూరు సంపత్‌ కుమారచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement