చాక్లెట్‌ కొనుక్కొని వస్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ కొనుక్కొని వస్తూ మృత్యుఒడికి..

Sep 5 2025 11:49 AM | Updated on Sep 5 2025 11:49 AM

చాక్లెట్‌ కొనుక్కొని వస్తూ మృత్యుఒడికి..

చాక్లెట్‌ కొనుక్కొని వస్తూ మృత్యుఒడికి..

గోవిందరావుపేట: చాక్లెట్‌ కొనుక్కొని వస్తూ ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. లారీ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గోవిందరావుపేటకు చెందిన చెన్ను నర్సింహరావు తన ఇంటి నిర్మాణం కోసం ఇటుక ఆర్డర్‌ చేయడానికి వెళ్లే క్రమంలో తోడుగా మనువడు కొప్పనాతి హర్షసాయి (4)ని వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హర్షసాయి కిరాణా షాపులో చాక్లెట్లు తీసుకుని రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో ఏటూరునాగారం నుంచి వరంగల్‌ వైపునకు వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నెల క్రితం రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇదే ప్రదేశంలో అల్లే వెంకటేష్‌ (17) మృతి చెందాడు. ఈ ప్రాంతంలో తరచూ రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

లారీ ఢీకొని బాలుడి దుర్మరణం

గోవిందరావుపేటలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement