మహిళా కూలీలతో మమేకమై.. | - | Sakshi
Sakshi News home page

మహిళా కూలీలతో మమేకమై..

Jul 27 2025 7:09 AM | Updated on Jul 27 2025 7:09 AM

మహిళా కూలీలతో మమేకమై..

మహిళా కూలీలతో మమేకమై..

పొలంలో వరి నాటు వేసిన డిప్యూటీ స్పీకర్‌

మరిపెడ రూరల్‌: మరిపెడ మండలంలో డిప్యూటీ స్పీకర్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఉల్లెపల్లి గ్రామ సమీపంలోని వరినాట్లు వేస్తున్న మహిళలకు చూసి ఎమ్మెల్యే తన కాన్వాయ్‌ని నిలిపారు. మహిళలను ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి నాటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఇంటర్‌ చదివే వరకు అన్ని రకాల వ్యవసాయ పనులు చేశానని అన్నారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement