వేసవి సెవులు కావటం, పెళ్లిళ్లు, ఉత్సవాలు ఉండటం, విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్షలు ఉండటంతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సరైన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరు బస్టాండ్ నుంచి కర్నూలు, ఆదోని ప్రాంతాలకు వెళ్లేందుకు శుక్రవారం బస్సులు దొరకలేదు. ఎండ వేడిని లెక్క చేయకుండా బస్సుల రాకకోసం గంటల తరబడి ప్రయాణికులు నిరీక్షించారు. ఒక్క బస్సు వస్తే సీటు కోసం దానితో పరుగులు పెట్టారు. ప్రమాదవశాత్తు టైరు కిందపడితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బస్సు సర్వీసులు పెంచి ప్రయాణికులు కష్టాలను తీర్చాల్సి ఉంది.
– ఎమ్మిగనూరురూరల్


