
వలసబాట పట్టిన ఆగవేళి
కోడుమూరు రూరల్: కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామానికి చెందిన సుమారు 100మందికి పైగా వ్యవసాయ కూలీలు బతుకు తెరువుకోసం ఆదివారం ఆరు బొలేరో వాహనాల్లో గుంటూరుకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ కూలీలు కోడుమూరులో తమ వాహనాలను ఆపుకుని కిరాణా సరుకులు, తిండిగింజలను కొనుగోలు చేసుకుని వెళుతూ కన్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయని, ఉన్న ఊర్లో చేసేందుకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గుంటూరులో పనులున్నాయని కొందరు చెప్పడంతో అక్కడికి వెళుతున్నామని చెప్పారు.

వలసబాట పట్టిన ఆగవేళి