
రమణీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు రథోత్సవాన్ని జరిపించారు. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రమణమ్మ, సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పలు విభాగాల అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

రమణీయం.. స్వర్ణ రథోత్సవం