జగ్గయ్యపేట అర్బన్: పట్టణానికి చెందిన వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఈనెల 25,26 తేదీల్లో మైసూరు లోని చాముండి విహార్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 29 వ ఆలిండియా షిటోర్యో కరాటే–డో చాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనపరిచారు. అకాడమీకి చెందిన ఎ.దైనిక, పి.జితేంద్ర జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి త్వరలో జపాన్లో సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు జరగనున్న 11 వ ఇంటర్నేషనల్ షిటోర్యో కరాటే–డో చాంపియన్షిప్ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. టి.లోహిత తృతీయ స్థానం సాధించగా, పి.అభిషిక్త్ మంచి ప్రతిభ కనపరిచాడు. ఈ సందర్భంగా సోమవారం అకాడమీలో జరిగిన అభినందన కార్యక్రమంలో అకాడమీ కోచ్ ఎరుగురాల పూజ విద్యార్థుల కృషిని అభినందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు అత్యుత్తమ ప్రతిభ కనపరచి దేశానికి, జగ్గయ్యపేటకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


