జి.కొండూరు: స్థానికంగా స్కూటీలను చోరీ చేస్తున్న దొంగను జి.కొండూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జి.కొండూరుకు చెందిన అజయ్బాబు అనే యువకుడు వాహన చోదకులు రోడ్డుపై పార్క్ చేసి వాహనాలకు తాళపు చెవి వదిలేసి వెళ్లగానే ముందుగా ఆ తాళపు చెవులను చోరీ చేసేవాడు. అవే తాళపు చెవులతో రాత్రి సమయాలలో స్కూటీలను చోరీ చేసేవాడు. ఈ విధంగా ఇటీవల జి.కొండూరులో మూడు స్కూటీలను ఎత్తుకెళ్లాడు. ఈ స్కూటీలను విక్రయించేందుకు వేరే ప్రాంతానికి తరలించే యత్నంలో భాగంగా గెయిల్ కంపెనీ ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో సంచరిస్తుండగా అజయ్బాబుని జి.కొండూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. అజయ్బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.


