అమ్మవారి సన్నిధిలో అన్నదాన పథకానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి సన్నిధిలో అన్నదాన పథకానికి విరాళాలు

Sep 4 2025 9:42 AM | Updated on Sep 4 2025 10:43 AM

అమ్మవారి సన్నిధిలో   అన్నదాన పథకానికి విరాళాలు

అమ్మవారి సన్నిధిలో అన్నదాన పథకానికి విరాళాలు

అమ్మవారి సన్నిధిలో అన్నదాన పథకానికి విరాళాలు 19 మంది మందుబాబులకు జరిమానా

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం(ఆజాద్‌ రోడ్‌)కు చెందిన సర్వ కృష్ణమోహన్‌ ప్రసాద్‌ దంపతులు నిత్యాన్నదానానికి రూ.2 లక్షలు, విజయవాడ కానూరుకు చెందిన విశ్వశ్రీ ప్రాజెక్ట్స్‌, ఆరో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని చింత శివరామకృష్ణ రూ.1,00,116 అందజేశారు. దాతలకు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం చేయించారు. అనంతరం వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 19 మందికి న్యాయస్థానం జరిమానాలు విధించింది. నగరంలోని 4వ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి 6వ అడిషనల్‌ జ్యూడిషల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్డులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి లెనిన్‌బాబు జరిమానాలు విధించారు. ఒక్కరికి రూ.15 వేలు, 18 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement