
ఆపరేషన్ సిందూర్కు సంఘీభావం
కోడూరు: పాకిస్తాన్పై భారత్ సైన్యం చేస్తున్న ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా కోడూరు పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ సర్పంచి వెన్నా షైనీ, కార్యదర్శి బండే శేషగిరిరావు పర్యవేక్షణలో వివిధ సంఘాలు, రాజకీయ ప్రముఖులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జవాన్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలపై మండిపడ్డారు. జాతీయ పతాకాలతో కోడూరు ప్రధాన రహదారుల వెంట ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటారు. అనంతరం ప్రధాన సెంటర్ల మానవహారం ఏర్పాటు చేశారు. మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, ఎస్కేఆర్ విద్యాసంస్థల సలహాదారు కోట వెంకటసుబ్బారావు, సచివాలయ సిబ్బంది, ఆర్యవైశ్య ప్రముఖలు పాల్గొన్నారు.