పీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

పీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు

May 1 2025 1:49 AM | Updated on May 1 2025 1:49 AM

పీఎం

పీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు

కోనేరుసెంటర్‌: ఈ నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను పురస్కరించుకుని జిల్లాలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు బుధవారం తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా...

● విశాఖపట్నం నుంచి చైన్నె వైపు వెళ్లే వాహనాలను కాకినాడ జిల్లా కత్తిపూడి సెంటర్‌ నుంచి వయా కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలు, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలుకు మళ్లిస్తారు.

● చైన్నె నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు వద్ద నుంచి త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం, లోస్రా బ్రిడ్జి, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్లాలి.

● చైన్నె నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు క్రాస్‌ రోడ్‌ నుంచి తెనాలి, పులిగడ్డ, మచిలీపట్నం, లోస్రాబ్రిడ్జి, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్లాలి.

● విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు తూర్పుగోదావరి జిల్లా దివాన్‌ చెరువు బైపాస్‌ మీదుగా వయా గమాన్‌ బ్రిడ్జి దేవరపల్లి గోపాలపురం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్లాలి.

● విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి, ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్లాలి. ఏలూరు బైపాస్‌ నుంచి జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి. ఏలూరు బైపాస్‌, చింతలపూడి, సత్తుపల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి.

● విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్లే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి.

● హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి గామన్‌ బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హహనుమాన్‌జంక్షన్‌, ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి.

● విజయవాడ విమానాశ్రయంకు వచ్చే వాహనదారులు రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ మీదుగా ఆంధ్రజ్యోతి, ముస్తాబాద, సూరంపల్లి అండర్‌ పాస్‌ ద్వారా కొత్త బైపాస్‌ రోడ్డుపై నుంచి బీబీ గూడెం అండర్‌ పాస్‌ ద్వారా గన్నవరం చైతన్య స్కూల్‌ జంక్షన్‌ వద్ద ఎన్‌ హెచ్‌ 16 కు వచ్చి అక్కడి నుంచి విజయవాడ విమానాశ్రయానికి వెళ్లాలి. ఈ ట్రాఫిక్‌ మళ్లింపులో కేవలం భారీ వాహనాలను మాత్రమే మళ్లిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ రాత్రి 10 గంటల నుంచి రెండో తేదీ రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటుందని చెప్పారు.

పీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు 1
1/1

పీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement