
మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని క్యూలైన్లలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లకు ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్) సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం శీర్షికన మంగళవారం సాక్షి ప్రచురించిన కథనానికి ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ స్పందించారు. ఈవో ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. వెంటనే క్యూలైన్లలోని మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు చేపట్టి పని చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు మహా మండపం క్యూలైన్లలోని మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు చేపట్టారు. అదే విధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల లగేజీ, బ్యాగులను క్లోక్రూమ్లో భద్రపరుచుకునేలా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగులు, పర్సులు మినహా ఇతర ఏ బ్యాగులను ఆలయంలోకి అనుమతించలేదు.
బ్యాగులు, సంచులతో ఆలయంలోకి నో ఎంట్రీ

మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు

మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు