గర్భిణులు, బాలింతల్లో ఏడు శాతం కంటే తక్కువగా రక్తం ఉంటే ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. 7–9 ఎనీమియా ఉంటే సుక్రోజ్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. 9 గ్రాముల రక్తం దాటితే మాత్రలు వేసుకోవాలి. ఉదయం 11గంటల లోపు ప్రయాణాలు ముగించేయాలి. చల్లటి పానీయాలు తీసుకోవడం చాలా మంచిది. నీటిశాతం అధికంగా ఉండే పళ్ల రసాలు తాగాలి. ఎక్కడికి వెళ్లినా ఓఆర్ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. పల్లిపట్టి అధికంగా తినాలి. – సీతారాం, జిల్లా వైద్యాధికారి


