సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

ఆసిపాబాద్‌రూరల్‌: సమస్యలు పరిష్కరించా లని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో డీఈవో లలితకు సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్‌ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఎంఐఎస్‌, సీసీవో, సీఆర్‌పీలకు సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీసీవో సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌, ఎంఐఎస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు గేడేకర్‌ సంతోష్‌, సీఆర్‌పీల సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌, సీసీ రాము, నాయకులు సందీప్‌, నాగేష్‌, తిరుపతి, మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement